చిన్నగంజాంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు :పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మహిళల అభివృద్ధి సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నగంజాంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలూరి, మహిళా నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ముఖ్యమంత్రి ప్రసంగ వీక్షణ వేదికపై ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని ఎమ్మెల్యే మహిళా ప్రతినిధులు ఆసక్తిగా వీక్షించారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రతిజ్ఞ మహిళల గౌరవాన్ని కాపాడతామని, వారి అభివృద్ధిలో భాగస్వాములవుతామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్కడికి విచ్చేసిన మహిళలు మరియు నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. మహిళల భాగస్వామ్యం గా ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మహిళా చైతన్యం వెల్లివిరిసేలా సాగిన ఈ వేడుకలు గ్రామస్థులను అలరించాయి. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఏలూరి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz