చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం

0
500

చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించారు. ఏఐటియూసీ యూనియన్ మద్దతుతో జరిగిన ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఎదురవుతున్న సమస్యలపై, ముఖ్యంగా నివాస స్థలాల విషయమై ఈ సందర్భంగా చర్చించారు.

ప్రభుత్వానికి విన్నపం "మాకు సొంత ఇల్లు కావాలి"

ఈ సమావేశంలో దివ్యాంగుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది దివ్యాంగులకు నివసించడానికి కనీసం సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు స్థానిక శాసనసభ్యులు మద్దూలూరి మాలకొండయ్య వెంటనే స్పందించి, దివ్యాంగులందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

నూతన కమిటీల ఎన్నిక

దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీలను ఎన్నుకున్నారు

ప్రధాన కమిటీ:

 

 కన్వీనర్: నూకతోటి దత్తాత్రేయ సహాయక కన్వీనర్: యనమల నాగేశ్వరరావు

 అధ్యక్షుడు: పెరికల జోసెఫ్

 సెక్రటరీ: మంత్రు నాయక్

 

 సహాయక కార్యదర్శులు: 

 

మంకెలా ప్రకాష్, పర్వతల ఈశ్వరరావు, వెంకట్రావు, బొందు గురవయ్య, ఎస్.కె. అమీర్ బాషా, నిడమనూరి ప్రవీణ్.

 జాయింట్ సెక్రటరీలు: సుబ్బారావు, గంగారావు, ఎస్.కె. నాగూర్ వలి, సలీం, దొబ్బకోటి లక్ష్మయ్య, పోలయ్య..

మహిళా కమిటీ:మహిళా దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మహిళా కమిటీని ఏర్పాటు చేశారు.అధ్యక్షురాలు: పి. సునీత సెక్రటరీ: ఎస్.కె. కరీమున్ఉపాధ్యక్షురాలు: పింకీ,జాయింట్ సెక్రటరీ: సుసన్న.

ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ ప్రతినిధులు, దివ్యాంగుల సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొని తమ నిరసనను, విన్నపాన్ని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీతారామాలయానికి భూమి పూజ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి...
By Benguluri Madhubabu 2026-02-26 10:51:17 0 163
Telangana
నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే
దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర...
By Sadaq Sadaq 2026-04-21 09:20:12 0 106
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 917
Chandigarh
Chandigarh Mayoral Elections to be Held via Show-of-Hands Voting
Chandigarh’s municipal politics is taking a turn towards transparency. The upcoming mayoral...
By Bharat Aawaz 2025-07-17 05:51:34 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com