చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం

0
501

చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించారు. ఏఐటియూసీ యూనియన్ మద్దతుతో జరిగిన ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఎదురవుతున్న సమస్యలపై, ముఖ్యంగా నివాస స్థలాల విషయమై ఈ సందర్భంగా చర్చించారు.

ప్రభుత్వానికి విన్నపం "మాకు సొంత ఇల్లు కావాలి"

ఈ సమావేశంలో దివ్యాంగుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది దివ్యాంగులకు నివసించడానికి కనీసం సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు స్థానిక శాసనసభ్యులు మద్దూలూరి మాలకొండయ్య వెంటనే స్పందించి, దివ్యాంగులందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

నూతన కమిటీల ఎన్నిక

దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీలను ఎన్నుకున్నారు

ప్రధాన కమిటీ:

 

 కన్వీనర్: నూకతోటి దత్తాత్రేయ సహాయక కన్వీనర్: యనమల నాగేశ్వరరావు

 అధ్యక్షుడు: పెరికల జోసెఫ్

 సెక్రటరీ: మంత్రు నాయక్

 

 సహాయక కార్యదర్శులు: 

 

మంకెలా ప్రకాష్, పర్వతల ఈశ్వరరావు, వెంకట్రావు, బొందు గురవయ్య, ఎస్.కె. అమీర్ బాషా, నిడమనూరి ప్రవీణ్.

 జాయింట్ సెక్రటరీలు: సుబ్బారావు, గంగారావు, ఎస్.కె. నాగూర్ వలి, సలీం, దొబ్బకోటి లక్ష్మయ్య, పోలయ్య..

మహిళా కమిటీ:మహిళా దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మహిళా కమిటీని ఏర్పాటు చేశారు.అధ్యక్షురాలు: పి. సునీత సెక్రటరీ: ఎస్.కె. కరీమున్ఉపాధ్యక్షురాలు: పింకీ,జాయింట్ సెక్రటరీ: సుసన్న.

ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ ప్రతినిధులు, దివ్యాంగుల సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొని తమ నిరసనను, విన్నపాన్ని తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ కంఠమహేశ్వర విగ్రహం ప్రతిష్టాపన. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.....
నల్లబెల్లి, ఏప్రిల్ 26. భారత్ అవాజ్ న్యూస్.. రాంపూర్, గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన...
By Gujile Ramu 2026-04-27 03:16:02 0 146
Telangana
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్...
By Pinnehasan Odela 2026-01-19 11:13:05 0 273
Telangana
స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి...
By Sidhu Maroju 2025-11-19 07:37:40 0 178
Andhra Pradesh
మదనపల్లి లో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్: 20 బైక్‌లు సీజ్.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్...
By Pagadala Venkateswar 2026-02-26 11:22:26 0 100
Telangana
నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు ‎మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )‎రూట్ లో  ఆర్ టి సి బస్సులు నడపండి
  ‎హైదరాబాదు నగరంలో  సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో...
By Ponnala Srinivasrao 2026-03-02 10:55:38 0 482
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com