అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసిన గద్య అనురాధ

0
285

*మహిళల సాధికారతకు విద్యే పునాది : గద్దె అనురాధ*

 

          విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్ లోని కె.వి.ఎస్.ఆర్ సిద్దార్థ ఫార్మసీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో, SAFE సంస్థ సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో మహిళా హక్కులు, సమానత్వం మరియు సాధికారతపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణాజిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో మహిళల హక్కులు, సమానత్వం మరియు సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి విద్య కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. మహిళల సామర్థ్యాన్ని గుర్తించి వారికి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో “నిజమైన సమానత్వం సాధించడానికి లింగ కోటా అవసరమా?” అనే అంశంపై వాదోపవాద పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులు తమ ఆలోచనాత్మక ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు అని SAFE సంస్థ ప్రతినిధి స్వరూప రాణి తెలిపారు.

కార్యక్రమానికి అతిథిగా హాజరైన సామాజిక కార్యకర్త శ్రీమతి పి.ఏ. దేవి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆచంటి సునీత మాట్లాడుతూ మహిళా దినోత్సవం మహిళల సాధికారతకు ప్రతీక అని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంపొందించి సమానత్వ భావనను పెంపొందించడానికి దోహదపడతాయని ఆమె అన్నారు.

కార్యక్రమంలో నిర్వహించిన వాదోపవాద పోటీల్లో విజేతలకు మరియు పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అని కార్యక్రమ కార్యనిర్వహణాధికారి మరియు మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డా. హెచ్. విజయలక్ష్మి తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళం
రాయచోటిలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు మూడు లక్షల విరాళం అందజేసిన మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్...
By Benguluri Madhubabu 2026-01-14 09:29:01 0 340
SURAKSHA
Ravindra Singh Yadav: Leading Andaman Police Forward
A distinguished AGMUT cadre IPS officer, Ravindra Singh Yadav serves as the Director General of...
By Lokeshwari Panthadi 2026-07-24 06:39:17 0 40
Andhra Pradesh
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-19 14:51:05 0 208
Telangana
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
By Sidhu Maroju 2025-12-17 15:02:46 0 238
Telangana
జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు.|
    హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
By Sidhu Maroju 2026-01-07 06:52:23 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com