మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ

0
598

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యాలయం.

 సమయం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు అధికారులతో సమీక్ష, అనంతరం 10 గంటల నుండి ప్రజల నుండి అర్జీల స్వీకరణ ఉంటుంది. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌కు అర్జీదారులు ఎవరూ రావద్దని, అన్ని శాఖల జిల్లా అధికారులు చీరాలలోనే అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. చీరాల రాలేని వారు తమ పరిధిలోని తహశీల్దార్ లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచ్చు అని తెలిపారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Like
1
Search
Categories
Read More
Telangana
అభివృద్ధిలో మంచిర్యాల రోల్ మోడల్ : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఆదివారం...
By Bonagiri RaviShankar 2026-06-14 13:37:37 0 192
Andhra Pradesh
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*అనకాపల్లి*   • స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 13:18:10 0 197
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....
ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు...
By Gujile Ramu 2026-04-25 11:17:50 0 176
Andhra Pradesh
పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక...
By Kothuru Murali 2026-01-29 08:51:21 0 161
Andhra Pradesh
మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.
మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప...
By Pagadala Venkateswar 2026-02-06 04:18:36 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com