రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన

0
132

 చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పార్టీకి కష్టపడిన వాళ్లకి జగనన్న గుర్తిస్తాడు:కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మణి గాంధీ
రాష్ట్రంలో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్లని మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్...
By mahaboob basha 2025-10-04 14:09:57 0 257
Andhra Pradesh
మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ. - శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషను పంపిణీ.
నెల్లూరు  కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్...
By Ratna Sekhar 2026-03-10 19:42:07 0 76
Andhra Pradesh
కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది
ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై...
By Benguluri Madhubabu 2026-03-10 13:55:33 0 124
Andhra Pradesh
ప్రత్తిపాడులో ఉద్యమి సభ్యత్వాలకు వేగం – అధినేత ఆదేశాలు, నేతల సమన్వయం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం...
By BABJI DADALA 2026-02-24 13:43:43 0 123
Telangana
Ex MLA ibrahimpatnam passes away
Kondigari Ramulu, the former MLA of Ibrahimpatnam, passed away on March 13, 2026, at the age of...
By G k Nookala 2026-03-13 16:57:26 0 85
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com