APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

0
76

గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం

మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

 

 

గుంటూరు, పల్నాడు, కర్నూలు సహా పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల ముప్పు

ప్రాణ నష్టం నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన విపత్తుల సంస్థ

రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. 

 

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం..ఈ మార్చి నెల నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

 

 

 

మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు మినహా మిగిలిన ప్రదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని సంస్థ అంచనా వేస్తోంది.

 

పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించగలమని ఆయన తెలిపారు. ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Ganta Srinivasa Rao: వైసీపీ తీరుపై ఈసీకి లేఖ రాస్తా: గంటా శ్రీనివాసరావు.
ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా...
By Pagadala Venkateswar 2026-02-02 07:30:30 0 83
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 260
Telangana
దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-04-04 08:20:57 0 98
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉద్యోగి అనుమానస్పద మృతి
దోర్నాలలోని వెలిగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉపాధిహామీ కార్యాలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకొని...
By Chennaiah Kati 2026-02-04 13:22:21 0 177
Telangana
నగరవాసుల ప్లేట్లలో 'విషం': భారీగా పట్టుబడ్డ కల్తీ పన్నీరు నిల్వలు.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీ కల్తీ పన్నీరు గుట్టురట్టు: 3,000 కిలోలు సీజ్.. ఆరు షాపులపై...
By Sidhu Maroju 2026-03-18 16:47:49 0 147
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com