హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!

0
175

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ. 70 కోట్లు అక్రమంగా చెల్లించారంటూ వివిధ క్రికెట్ సంఘాలు సోమవారం జింఖానా గ్రౌండ్‌లో మెరుపు ధర్నాకు దిగాయి.

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి ఆదేశాల మేరకు హెచ్‌సీఏలోని పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా రూ. 70 కోట్ల నిధులను విశాఖ ఇండస్ట్రీస్‌కు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.

క్రికెట్ అభివృద్ధికి వాడాల్సిన నిధులను ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనకారులు సంఘటనా స్థలంలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తీవ్రంగా తోసిపుచ్చారు. ఆందోళనల మధ్యే ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 

"నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క చెక్కు పైనా సంతకం చేయలేదు. విశాఖ కంపెనీకి జరిగిన 69 కోట్ల రూపాయల చెల్లింపుల వ్యవహారం నేను బాధ్యతలు తీసుకోకముందే పూర్తయింది. ఇది గతంలో జరిగిన ప్రాసెస్" అని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సదరు కంపెనీకి డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని, న్యాయస్థాన ఉత్తర్వుల మేరకే ఆ ప్రక్రియ జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. తనపై బురదజల్లేందుకే కొందరు కావాలని ఈ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరు పక్షాల వాదనలతో హెచ్‌సీఏలో రాజకీయ సెగలు రాజుకున్నాయి.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
"తప్పు చేస్తే తప్పించుకోలేరు: మల్కాజ్‌గిరి స్పెషల్ డ్రైవ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు పెట్టుకుని రోడ్లపై కేరాఫ్...
By Sidhu Maroju 2026-04-21 16:52:23 0 243
Andhra Pradesh
ఉపాధి హామీ వేతనదారుడు మృతి
గంట్యాడ మండలం కొత్త వెలగాడలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనిలో చౌడువాడ కన్నయ్య తాత అనే...
By Boiena Rajesh 2026-04-22 00:35:31 0 200
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం: నేడు ఉదయం విజయవాడ...
By Rajini Kumari 2026-01-07 16:20:03 0 201
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో దంచి కొట్టిన వర్షం కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో సోమవారం సాయంత్రం వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. సాయంత్రం...
By Kothuru Murali 2026-05-18 15:29:37 0 75
Maharashtra
Maharashtra Expands Infrastructure and Transport Network
Maharashtra continues to accelerate infrastructure and transport development through major...
By Fathima Safa 2026-07-06 08:19:18 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com