హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!

0
127

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ. 70 కోట్లు అక్రమంగా చెల్లించారంటూ వివిధ క్రికెట్ సంఘాలు సోమవారం జింఖానా గ్రౌండ్‌లో మెరుపు ధర్నాకు దిగాయి.

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి ఆదేశాల మేరకు హెచ్‌సీఏలోని పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా రూ. 70 కోట్ల నిధులను విశాఖ ఇండస్ట్రీస్‌కు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.

క్రికెట్ అభివృద్ధికి వాడాల్సిన నిధులను ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనకారులు సంఘటనా స్థలంలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తీవ్రంగా తోసిపుచ్చారు. ఆందోళనల మధ్యే ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 

"నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క చెక్కు పైనా సంతకం చేయలేదు. విశాఖ కంపెనీకి జరిగిన 69 కోట్ల రూపాయల చెల్లింపుల వ్యవహారం నేను బాధ్యతలు తీసుకోకముందే పూర్తయింది. ఇది గతంలో జరిగిన ప్రాసెస్" అని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సదరు కంపెనీకి డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని, న్యాయస్థాన ఉత్తర్వుల మేరకే ఆ ప్రక్రియ జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. తనపై బురదజల్లేందుకే కొందరు కావాలని ఈ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరు పక్షాల వాదనలతో హెచ్‌సీఏలో రాజకీయ సెగలు రాజుకున్నాయి.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
డాక్టర్ లేక పేషంట్ అవస్థలు
బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు మహబూబాబాద్ జిల్లా:::...
By Bittu Bittu 2026-04-11 03:12:15 0 601
Andhra Pradesh
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-02-09 08:19:55 0 129
Andhra Pradesh
దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించిన కేసినేని చిన్ని
*ప్ర‌చుర‌ణార్థం* *28-02-2026*   *దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-28 12:56:30 0 120
Andhra Pradesh
మదనపల్లె నేత తులసికి రాష్ట్ర TDP కార్యదర్శి పదవి.
మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పచ్చిపాల తులసిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా అధిష్ఠానం బుధవారం...
By Pagadala Venkateswar 2026-04-16 03:26:22 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com