అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

0
125

*వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*

 

*సతీసమేతంగా పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్*

 

*స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు*

 

మంగళగిరి: మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 12 గం.లకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. అంతకుముందు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామి వారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.
కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-03-02 03:16:24 0 116
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 1K
Andhra Pradesh
ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు : కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా :ప్రభుత్వ పథకాల పేరుతో  సైబర్‌ నేరగాళ్ల మోసాలు...సైబర్ నేరాల...
By Hari Krishna 2026-01-16 12:08:45 0 157
Andhra Pradesh
యువతి ఆత్మహత్య కేసు ఆరుగురు అరెస్ట్
యువతి ఆత్మహత్య కేసు – ఆరుగురు అరెస్ట్     విశాఖపట్నం , ఆరిలోవ :...
By Rajini Kumari 2026-04-18 17:20:59 0 85
Andhra Pradesh
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు...
By Pagadala Venkateswar 2026-05-15 05:54:04 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com