AP Farmers: రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ కూటమి ప్రభుత్వం.

0
168

ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఈ నెలాఖరులోగా పెండింగ్ దరఖాస్తులన్నింటికీ అనుమతులు జారీ చేయాలని, రెండు నెలల్లోగా కనెక్షన్లను పూర్తిగా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలను) ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అవసరమైన 10,000 కొత్త ట్రాన్స్‌‌ఫార్మర్లను కేటాయించనుంది. 

 

ఈ విషయంపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రెండు నెలల్లోగా పెండింగ్ కనెక్షన్లన్నీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని డిస్కంలను ఆదేశించామన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 22.30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 1.12 లక్షల కనెక్షన్లను మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో మరో 46 వేల మందికి పైగా రైతులకు వ్యవసాయ పనులకు విద్యుత్ సౌకర్యం అందనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లి పట్టణంలో కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురైన విగ్నేష్ (25) అనే యువకుడు ఎలుకల మందు తాగి...
By Pagadala Venkateswar 2026-01-15 11:21:14 0 185
Andhra Pradesh
పుంగనూరు: చిన్నారి వైద్యానికి ఆర్థికంగా అండగా ఎంపీ
అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆలియా అనే చిన్నారికి గుండెలో రంధ్రం ఉన్నట్లు...
By Kothuru Murali 2026-06-22 10:53:22 0 68
SURAKSHA
Dr. Chandra Bhushan Kumar: Leading Island Governance
A visionary 1995-batch IAS officer of the AGMUT Cadre, Dr. Chandra Bhushan Kumar is steering the...
By Lokeshwari Panthadi 2026-07-18 06:49:24 0 63
Business & Finance
Centre Reviews Assam Flood Damage, Speeds Relief Plans
Union Ministers Shivraj Singh Chouhan and Kiren Rijiju conducted ground and aerial surveys of...
By Navya Sree 2026-07-02 06:20:14 0 35
Andaman & Nikobar Islands
Great Nicobar Census: Paving the Way for a Megaproject
The Andaman and Nicobar Islands administration has officially launched the long-awaited...
By Lokeshwari Panthadi 2026-06-30 08:01:38 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com