విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది.

0
148

చీరాల: ఈరోజు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నందు విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డియల్డివో కే. పద్మావతి గారు మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ చట్టాన్ని సవరించి వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 రూపొందించడం జరిగినదని, పథకం పేరు మార్చడంతో పాటు అదనంగా 25 రోజులు పెంచి 125 రోజులు పని దినాలు పెంచారని, పథకంలో అమలు అయ్యే పనుల గురించి మరియు విభిజి రాంజీ యొక్క ప్రయోజనాల గురించి 6 వారాలపాటు మండల మరియు గ్రామీణ స్థాయిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి చట్టం యొక్క లక్ష్యం ఉపాధి శ్రామికుల హక్కులు, చెల్లింపు వ్యవస్థ, పంచాయితీ ఆధారిత అమలు పై విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.గ్రామస్థాయి సిబ్బంది అందరూ ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి  పథకం యొక్క ఉద్దేశం, లక్ష్యాలు విశిష్టతను ప్రజలకు అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో "జన్ సంవాద్" పేరుతో చేపట్టే ప్రచార కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎంపీడీవో గారు, ఏపీఓ మరియు చీరాల, వేటపాలెం ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, అనుబంధ శాఖల సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
వి జి ఆర్ లాడ్జ్ ప్రారంభించిన మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి
ఈరోజు రాయచోటి పట్టణంలోని సుండుపల్లి బైపాస్ రోడ్డు నందు వల్లూరు వాసుదేవ రెడ్డి నూతనంగా నిర్మించిన...
By Benguluri Madhubabu 2026-02-26 11:04:47 0 136
Andhra Pradesh
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-11 14:01:48 0 147
Andhra Pradesh
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్ : డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ...
By Hari Krishna 2026-01-18 10:06:20 0 102
Andhra Pradesh
మార్కాపురం బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం
మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి ప్రమాదంలో పలువురు సజీవ...
By Benguluri Madhubabu 2026-03-26 04:55:43 0 117
Andhra Pradesh
శ్రీ అమ్మవారి శ్రీ చక్రం పూజకు గోశాల పాలు
శ్రీ అమ్మవారి శ్రీ చక్ర నవారాణార్చన పూజకు పోరంకి గోశాల పాలు: పత్రికా ప్రకటన     ...
By Rajini Kumari 2026-01-16 12:44:37 0 122
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com