తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు
వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన పులగోర వేదమూర్తి (38), సుమారు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం వెతుకులాట కొనసాగుతుండగా, వేటపాలెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
స్టేషన్లో విచారణ జరపగా తన పేరు, చిరునామా వివరాలు వెల్లడించాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా వారు స్టేషన్కు చేరుకున్నారు. అవసరమైన ధృవీకరణ అనంతరం వేదమూర్తిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వేటపాలెం ఎస్సై తెలిపారు.
ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యుడు క్షేమంగా తిరిగి రావడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz