తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు

0
135

వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన పులగోర వేదమూర్తి (38),  సుమారు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం వెతుకులాట కొనసాగుతుండగా, వేటపాలెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌లో విచారణ జరపగా తన పేరు, చిరునామా వివరాలు వెల్లడించాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా వారు స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన ధృవీకరణ అనంతరం వేదమూర్తిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వేటపాలెం ఎస్సై తెలిపారు.
ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యుడు క్షేమంగా తిరిగి రావడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదుPPP విధానంపై ముందుకే
*Press Release*   *పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదు*   *పీపీపీ విధానంపై ముందుకే......
By Rajini Kumari 2025-12-25 07:50:47 0 209
Telangana
చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ సంవత్సర వేడుకలు. కాలనీ టూల్ రూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వెంకటాపురం డివిజన్లోని చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్...
By Sidhu Maroju 2025-08-24 15:58:26 0 499
Andhra Pradesh
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నిర్వహించారు
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు...
By Chennaiah Kati 2026-02-06 15:21:48 0 179
Telangana
మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.
మెదక్ జిల్లా నర్సాపూర్ బాయ్స్ తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల...
By Gangaram Rangagowni 2026-01-19 10:43:13 0 257
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com