తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు

0
169

వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన పులగోర వేదమూర్తి (38),  సుమారు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం వెతుకులాట కొనసాగుతుండగా, వేటపాలెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌లో విచారణ జరపగా తన పేరు, చిరునామా వివరాలు వెల్లడించాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా వారు స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన ధృవీకరణ అనంతరం వేదమూర్తిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వేటపాలెం ఎస్సై తెలిపారు.
ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యుడు క్షేమంగా తిరిగి రావడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు  జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు...
By Eslavath RameshNaik 2026-01-19 05:05:00 0 440
Telangana
మహిళల సాధికారతకు అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి|
హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం...
By Avunoori Mahesh 2026-05-07 12:26:51 0 140
Andhra Pradesh
ప్రజాస్వామ్య దేవాలయంలో విద్యార్థుల పర్యటన
*ప్రజాస్వామ్య దేవాలయంలో భావి భారత పౌరులు: అసెంబ్లీలో విద్యార్థుల పర్యటన*   అమరావతి : చట్ట...
By Rajini Kumari 2026-02-13 09:14:22 0 135
Telangana
సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
పెద్దపల్లి మండలం కనగర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి...
By Sunka Santhosh 2026-04-29 17:10:23 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com