తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు

0
227

వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన పులగోర వేదమూర్తి (38),  సుమారు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం వెతుకులాట కొనసాగుతుండగా, వేటపాలెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌లో విచారణ జరపగా తన పేరు, చిరునామా వివరాలు వెల్లడించాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా వారు స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన ధృవీకరణ అనంతరం వేదమూర్తిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వేటపాలెం ఎస్సై తెలిపారు.
ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యుడు క్షేమంగా తిరిగి రావడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మీ భూసమస్యకు స్వస్థ పరిష్కారం చూపటమే మా లక్ష్యం- జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు
"మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే మా లక్ష్యం" – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు...
By Chennaiah Kati 2026-06-22 06:07:49 0 61
Andhra Pradesh
మార్కాపురం మండలం,రాయవరం గ్రామంలోని చెరువులో జరుగుతున్న
మార్కాపురం మండలం,రాయవరం గ్రామంలోని చెరువులో జరుగుతున్నVB-GRAM G పనులను పరిశీలించిన జిల్లా...
By Chennaiah Kati 2026-07-14 10:59:44 0 48
Business & Finance
Labour Registration Secures Every Business Legally
Labour registration is a crucial legal requirement for businesses employing workers, ensuring...
By Navya Sree 2026-07-09 07:31:23 0 83
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళలో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం...
By Chennaiah Kati 2026-01-28 04:46:58 0 194
Telangana
Ban the hostel businesses in Hyderabad
Govt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential...
By Terli Ashok 2026-02-14 12:00:18 0 672
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com