కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|

0
136

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలిశారు. కాలనీలో ఎదుర్కొంటున్న పలు పౌర సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. 

 

ప్రధానంగా వీధి దీపాల నిర్వహణ, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మల ప్రూనింగ్, విద్యుత్ సరఫరా మెరుగుదలకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, పార్కు సుందరీకరణ మరియు సిసి రోడ్ల ఆవశ్యకతపై సుదీర్ఘంగా చర్చించారు.

 

కాలనీ వాసుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి , వెంటనే సంబంధిత విభాగాల అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో కిష్టమ్మ ఎన్క్లేవ్ నూతన కమిటీ అధ్యక్షుడు బి. ఉమేష్ నాయుడు, ఉపాధ్యక్షుడు ఆనంద్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ఉమా మహేశ్వర రావు, కోశాధికారి ఆర్. చిరంజీవి, జాయింట్ సెక్రటరీ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలపై తక్షణమే స్పందించినందుకు కమిటీ సభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

 

#Sidhumaroju

ఆల్వాల్

Search
Categories
Read More
Telangana
కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి...
By Avunoori Mahesh 2026-04-26 07:00:29 0 115
Telangana
గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి
చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ...
By Nookapangu Manikanta 2026-05-15 14:26:09 0 65
Telangana
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు
మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా...
By Avunoori Mahesh 2026-04-11 06:30:42 0 149
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com