వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్

1
783

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, ఈ ఘటన అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచేసిందన్నారు.

బాణాసంచా కేంద్రాల్లో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం ప్రాంతంలో జరిగిన ఘటన మరువకముందే వేట్లపాలెంలో మరో దుర్ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

జిల్లాలోని ఫైర్‌వర్క్స్ యూనిట్లలో కార్మిక చట్టాలు, భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి, కొన్ని రోజుల తర్వాత మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ ప్రమాదంపై నిష్పక్షపాత, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే ప్రమాద నివారణలో విఫలమైన సంబంధిత ఫైర్ స్టేషన్, రెవెన్యూ అధికారులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పులి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
India and Japan Push Forward 'Smart Island' Plan for Andaman & Nicoba
In early June, India and Japan strengthened their partnership to develop the Andaman &...
By Bharat Aawaz 2025-07-17 08:37:30 0 1K
Telangana
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల...
By Pinnehasan Odela 2026-01-14 18:42:55 0 197
Telangana
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం..
PM Narender modi .... March 27 Today 6:30 pm 
By Sunka Santhosh 2026-03-27 12:07:27 0 231
Andhra Pradesh
ఆక్సిడెంట్ లో ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు నూతన బైపాస్ జే–టోన్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-01-03 11:18:46 0 163
Telangana
"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్,...
By Sidhu Maroju 2026-04-22 15:38:21 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com