వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్

1
1K

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, ఈ ఘటన అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచేసిందన్నారు.

బాణాసంచా కేంద్రాల్లో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం ప్రాంతంలో జరిగిన ఘటన మరువకముందే వేట్లపాలెంలో మరో దుర్ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

జిల్లాలోని ఫైర్‌వర్క్స్ యూనిట్లలో కార్మిక చట్టాలు, భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి, కొన్ని రోజుల తర్వాత మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ ప్రమాదంపై నిష్పక్షపాత, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే ప్రమాద నివారణలో విఫలమైన సంబంధిత ఫైర్ స్టేషన్, రెవెన్యూ అధికారులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పులి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్‌బోటు సేవలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్‌బోటు సేవలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు...
By Gadiyapudi Narendra 2026-01-12 11:46:59 0 341
Telangana
అగ్నివీర్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్/ హైదరాబాద్   నిరుద్యోగులకు మరోసారి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం....
By Sidhu Maroju 2025-08-02 18:37:23 0 969
Telangana
విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.
కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా...
By Dodla Nagaraju 2026-04-19 13:56:08 0 270
Telangana
140వ మేడే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న
ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా..   మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో...
By Pinnehasan Odela 2026-05-01 14:07:56 0 249
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
By Sidhu Maroju 2025-07-10 12:07:14 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com