Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.

0
379

గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు

బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు

గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు

 

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా కాకినాడ జిల్లాలోని ప్రమాద స్థలానికి హెలికాప్టర్ లో హుటాహుటిన బయలుదేరారు. ఘటనా స్థలిని పరిశీలించి, మృతుల కుటుంబాలను, బాధితులను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.

 

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే హోంమంత్రి అనితను, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. "పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది" అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు.

 

వేట్లపాలెం-జి.మేడపాడు మధ్య పొలాల్లో ఆరు షెడ్లు వేసి అడబాల వీరబాబు అనే వ్యక్తి ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పేలుడు ధాటికి వేట్లపాలెం గ్రామంలోని పలు ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. 

 

కాగా, మధ్యాహ్న భోజనం కోసం కొంతమంది కార్మికులు బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు దక్కాయి. ఈ పరిశ్రమలో గతంలోనూ పేలుడు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Search
Categories
Read More
Business & Finance
Boost Global Sales with Easy Export Business
Take your business beyond borders with hassle-free export business registration. Export...
By Navya Sree 2026-07-11 05:44:08 0 64
Andhra Pradesh
మదనపల్లె: ఘనంగా రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం - ఫోర్డ్ సంస్థ.
మదనపల్లె జూనియర్ కళాశాలలో ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు....
By Pagadala Venkateswar 2026-05-29 05:25:19 0 61
Andhra Pradesh
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై మహేష్ హెచ్చరిక
రెచ్చగొట్టే పోస్టులకు చెక్. సుండుపల్లి పోలీసులు హెచ్చరిక. సుండుపల్లి మండలంలోని వాట్సాప్ గ్రూపులో...
By Benguluri Madhubabu 2026-07-13 01:16:00 0 84
Andhra Pradesh
సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!
  సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!   Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-06-16 04:35:27 0 54
Telangana
మాకు చెప్పులు అక్కర్లేదు..ఆధారాలతోనే కొడతాం..
మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్‌ వై.సతీశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా...
By Ponnala Srinivasrao 2026-04-14 01:51:37 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com