Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.

0
254

గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు

బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు

గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు

 

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా కాకినాడ జిల్లాలోని ప్రమాద స్థలానికి హెలికాప్టర్ లో హుటాహుటిన బయలుదేరారు. ఘటనా స్థలిని పరిశీలించి, మృతుల కుటుంబాలను, బాధితులను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.

 

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే హోంమంత్రి అనితను, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. "పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది" అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు.

 

వేట్లపాలెం-జి.మేడపాడు మధ్య పొలాల్లో ఆరు షెడ్లు వేసి అడబాల వీరబాబు అనే వ్యక్తి ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పేలుడు ధాటికి వేట్లపాలెం గ్రామంలోని పలు ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. 

 

కాగా, మధ్యాహ్న భోజనం కోసం కొంతమంది కార్మికులు బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు దక్కాయి. ఈ పరిశ్రమలో గతంలోనూ పేలుడు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల 32 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల...
By Avunoori Mahesh 2026-05-16 07:48:06 0 80
Telangana
ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి, ‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి సంజయ్ సుపుత్రుడు.
ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి,  ‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి...
By Ponnala Srinivasrao 2026-05-10 02:15:23 0 81
Andhra Pradesh
మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
*కృష్ణాజిల్లా మచిలీపట్నం*    మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి...
By Rajini Kumari 2026-03-24 12:09:45 0 159
Telangana
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు...
By Pinnehasan Odela 2026-04-09 13:52:32 0 142
Andhra Pradesh
Amaravati: అమరావతికి చట్టబద్ధత... పార్లమెంట్‌లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు...
By Pagadala Venkateswar 2026-01-21 14:56:38 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com