విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.

0
72

జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సుబ్రహ్మణ్యం, ఏపీసీ అనూరాధ విద్యార్థుల ప్రదర్శనలను ప్రశంసించారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, నిత్య జీవితంలో శాస్త్రీయ దృక్పథాన్ని, తార్కిక ఆలోచనలను అలవర్చుకోవాలని, సి. వి. రామన్ స్ఫూర్తితో సృజనాత్మకతను పెంపొందించుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఈవో సూచించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com