మారుమూల పల్లె నుంచి మైదానం వరకు...జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన గిరిజన యువతి!

0
517

​ మహబూబాబాద్/గంగారం, ఫిబ్రవరి 27 (భారత్ ఆవాజ్):  అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది గంగారం మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతి. గంగారం మండల కేంద్రానికి అత్యంత దూరంలో ఉన్న తిరుమలగండి గ్రామానికి చెందిన తాటి కృష్ణవేణి, తన ప్రతిభతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) జట్టులో చోటు సంపాదించి, జాతీయ స్థాయి BCCI వన్డే మహిళా టోర్నీకి ఎంపికైంది.

​*మంత్రి సీతక్క ప్రోత్సాహం*

​కృష్ణవేణి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. మంత్రి ఆదేశాల మేరకు గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు బుధవారం కృష్ణవేణిని కలిసి ఘనంగా సత్కరించారు. మంత్రి సీతక్క తరపున కృష్ణవేణికి తక్షణ సాయంగా 10,000 రూపాయల నగదును అందజేశారు. భవిష్యత్తులో కృష్ణవేణికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను మంత్రి అందిస్తారని వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో రాణించి, త్వరలోనే భారత ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో కూడా చోటు సంపాదించాలని నాయకులు ఆకాంక్షించారు. ​"అడవిలో వికసించిన ఆణిముత్యంలా కృష్ణవేణి తన ప్రతిభను చాటుకుంది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని జాడి వెంకటేశ్వర్లు అన్నారు.​ఈ కార్యక్రమంలో కోమట్లగూడెం సర్పంచ్ గుంట రామారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం సమ్మయ్య, కంగాల శీను, వెంకన్న, మోహన్ రావు, అశోక్, సురేష్, బాలకృష్ణ, పల్లె సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వరమ్మ నియామకం, ఘన సన్మానం
చిత్తూరు జిల్లా పుంగనూరులో భారతీయ జనతా పార్టీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ ఈశ్వరమ్మ...
By Kothuru Murali 2026-04-09 07:29:03 0 125
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం...
By Pagadala Venkateswar 2026-06-26 03:13:20 0 44
Business & Finance
Monsoon Rains Slow Mumbai Logistics and Supply Chains
Continuous heavy rainfall across Mumbai has disrupted logistics operations, slowing cargo...
By Navya Sree 2026-07-03 05:37:08 0 42
Andhra Pradesh
మదనపల్లె-రామసముద్రం ఆర్టీసీ బస్సుల దుస్థితి.. ప్రయాణికుల ఆవేదన.
మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు సరిగా లేకపోవడం, ఉన్నవి కూడా తరచూ ఆగిపోవడంతో...
By Pagadala Venkateswar 2026-05-24 07:41:39 0 109
Andhra Pradesh
బొబ్బిలి కమిషనర్ సూచనలు
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-12 15:30:56 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com