ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు సవరణ,తొలగింపు,కార్యక్రమాలు పారదర్శకతో బిఎల్వోలు చేస్తున్నారని ఏమైనా లోటు పాట్లు ఉంటే మా దృష్టికి తేవాలని అన్నారు అలాగే ఇప్పటివరకు చేర్చిన ఓటర్లు,సవరించిన,తొలగించిన ఓటర్ల వివరాలు తెలియజేశారు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల వారు తమ బూతు ఏజెంట్ల వివరాలు విధిగా ఇవ్వాలని మార్చి రెండవ వారం లోపల మీ బూత్ ఏజెంట్ లిస్టు ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ,వేటపాలెం ఎమ్మార్వో గీతా రాణి,చీరాల ఎంపీడీవో విజయ శ్రీ,వేటపాలెం ఎంపీడీవో రాజేష్,చీరాల మున్సిపల్ కమిషనర్ డేనియర్ జోసెఫ్,
జనసేన పార్టీ నుండి గూడూరు శివరాం ప్రసాద్,తెలుగుదేశం పార్టీ నుండి కీర్తి ప్రసాద్,బీఎస్పీ నుండి భగత్ సింగ్,సిపిఎం నుండి ఎన్ బాబురావు,వైఎస్ఆర్సిపి నుండి బత్తుల అనిల్ , గుంటూరు ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నుండి షేక్ అలీమ్ మరియు ఎంపీటీవో ఎమ్మార్వో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz