Andhra Pradesh Weather: ఏపీలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు.. మార్చిలో భానుడి భగభగలు!

0
177

మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక

దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉందన్న ఐఎండీ

ఏపీలో మార్చి తొలివారంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్న అమరావతి వాతావరణ కేంద్రం

అనంతపురంలో గురువారం అత్యధికంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

 

వాతావరణ మార్పుల ప్రభావంతో వేసవి కాలం రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మార్చి నెలలోనే ఎండలు, ఉక్కపోత తీవ్రంగా ఉండనున్నాయి. 

 

రాజస్థాన్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పశ్చిమ, దక్షిణ భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్చి తొలి రోజుల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. 

 

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికే రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. అనంతపురంలో అత్యధికంగా 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, కావలి వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన.
  ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన...
By Pagadala Venkateswar 2026-06-06 06:09:07 0 86
Andhra Pradesh
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
 దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర...
By Karapati Gopi 2026-01-01 05:50:05 0 740
Business & Finance
Registered Address Change Made Simple for Businesses
Updating your registered office address is essential to keep your business legally compliant and...
By Navya Sree 2026-07-10 07:57:01 0 70
Andhra Pradesh
మదనపల్లిలో ఏడునెలల గర్భిణీ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన ఏడునెలల గర్భిణీ, 22 ఏళ్ల కల్పన, కుటుంబ కలహాల కారణంగా సోమవారం రాత్రి వాసమోలు...
By Pagadala Venkateswar 2026-01-27 06:56:44 0 161
Manipur
Security Forces Intensify Rescue Operations for Hostages
Security forces, along with specialized sniffer dog squads, have stepped up massive combing...
By Dunna Jessicaruth 2026-05-20 09:34:35 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com