Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.

0
137

వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు

టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతుందన్న అధికారులు

రూ. 300 టికెట్ ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని వెల్లడి

 

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

 

 

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపారు. 

 

నిన్న మొత్తం 74,902 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 22,869 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.05 కోట్ల ఆదాయం వచ్చింది.

Search
Categories
Read More
Andhra Pradesh
చెడును త్వజించి మంచిని ఆహ్వానించడమే భోగి అంతరార్థం
*చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని...
By Rajini Kumari 2026-01-14 12:29:11 0 104
Bharat Aawaz
Our Mission: From Silence to Strength. .
In a world of noise, the stories that matter most often go unheard. They are lost in remote...
By Bharat Aawaz 2025-07-08 18:42:24 0 1K
Telangana
గవర్నర్ ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో ఫేక్ రిపోర్టర్ కలకలం.|
హైదరాబాద్ :  హైటెక్ సిటీ – ఆవాస హోటల్‌లో జరిగిన గవర్నర్ ప్రోగ్రాంలో నేషనల్ మీడియా...
By Sidhu Maroju 2025-11-28 17:34:23 0 154
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com