అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎలిజిబెత్ రేఖ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి(సి.ఐ.టి.యు)

0
313

బాపట్ల జిల్లా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను వీధుల పాలు చేసిందని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని హామీలిచి నెరవేర్చకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బాపట్ల లోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో అంగన్వాడీలు కూర్చొన్నారు.అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల జీతాలు, పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలన్నారు. వేసవి సెలవుల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

సిఐటియు బాపట్ల జిల్లా కార్యదర్శి సి.హెచ్.మజుందార్ మాట్లాడుతూ...
 
ఐదు సంవత్సరంలోపు పిల్లలు
విధిగా అంగన్వాడీ స్కూల్లో చదివేలా జీవో విడుదల చేయాలన్నారు. అంగన్వాడీలకు నేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల కన్వీనర్ శరత్ అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు శైలశ్రీ,హేమమాలిని, సీతామహాలక్ష్మి,హైమా,శ్రీలత,బేబీ రాణి,భారతి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
కాళేశ్వరం పర్యటనలో సీఎం తో పాటు పాల్గొననున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు...
By Avunoori Mahesh 2026-04-20 03:52:37 0 175
Business & Finance
Jharkhand Showcases Investment Opportunities in New Delhi
The Jharkhand government is hosting a National Stakeholders Consultation in New Delhi to showcase...
By Navya Sree 2026-07-04 08:00:08 0 71
Andhra Pradesh
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్  బాపట్ల:  ఐవిఎస్ సర్వేలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:33:59 0 231
Telangana
కొడుకులు పట్టించుకోవడం లేదు పోలీస్ స్టేషన్లో ఆశ్రమించిన వృద్ధ దంపతులు....
భారత్ అవాజ్ న్యూస్:23 జూన్ రోజున వరంగల్ జిల్లా  దుగ్గొండి:  మండలం వెంకటాపురం...
By Gujile Ramu 2026-06-23 08:18:14 0 124
Andhra Pradesh
వేటపాలెంలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.
నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ...
By Vadlamudi NagaVenkat 2026-03-05 07:27:56 1 523
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com