అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎలిజిబెత్ రేఖ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి(సి.ఐ.టి.యు)

0
238

బాపట్ల జిల్లా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను వీధుల పాలు చేసిందని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని హామీలిచి నెరవేర్చకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బాపట్ల లోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో అంగన్వాడీలు కూర్చొన్నారు.అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల జీతాలు, పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలన్నారు. వేసవి సెలవుల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

సిఐటియు బాపట్ల జిల్లా కార్యదర్శి సి.హెచ్.మజుందార్ మాట్లాడుతూ...
 
ఐదు సంవత్సరంలోపు పిల్లలు
విధిగా అంగన్వాడీ స్కూల్లో చదివేలా జీవో విడుదల చేయాలన్నారు. అంగన్వాడీలకు నేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల కన్వీనర్ శరత్ అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు శైలశ్రీ,హేమమాలిని, సీతామహాలక్ష్మి,హైమా,శ్రీలత,బేబీ రాణి,భారతి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవ మహిళ 18 ఏళ్ల నరకయాతనకు విముక్తి
ఏలూరు జిల్లా    జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవ.. మహిళ 18 ఏళ్ల నరకయాతనకు...
By Rajini Kumari 2026-01-21 14:45:19 0 129
Andhra Pradesh
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక శ్రీనీలకంఠ గారికి జిల్లా కార్యదర్శి టీ కే బందే...
By mahaboob basha 2025-07-07 14:00:33 0 1K
Andhra Pradesh
తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50...
By Ratna Sekhar 2026-03-05 18:14:19 0 670
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com