ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన

0
124

*ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, నేతన్నల అభివృద్ధికి తీసుకున్న చర్యలపై చీరాల ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కింది విధంగా స్పందించారు...*

 

* చీరాల చేనేత క్లస్టర్ కు ఎన్.ఆర్.ఎల్.ఎం కింద రూ.4.17 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

* ఆప్కో, చేనేత సంఘాలు విక్రయించిన వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం

* చేనేత సంక్షేమానికి త్రిఫ్ట్ పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరపతి పథకాలు అమలు చేస్తున్నాం. త్వరలో నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు చేయబోతున్నాం..

* జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి)లో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు నిర్ణయించడమైనది

* పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించాం...

* రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం(ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లు మంజూరు చేశాం..

* సహాయక క్లస్టర్లతో పాటు ఇతలర క్లస్టర్లకు ఆర్థిక సాయం చేస్తున్నాం..

* ముడి పదార్థాల సరఫరా పథకం, నేత కార్మికులకు ముద్రా పథకం అమలు చేస్తున్నాం

* చేనేత వస్త్రాల అమ్మకం పెంచేలా ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు ఏర్పాటుచేస్తున్నాం..

* గత ప్రభుత్వం చిన్న సంస్థ అయిన ఆప్కోను కూడా విడిచిపెట్టలేదు...

* ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్లు పక్కదారి పట్టించడం వల్ల ఆ సంస్థలో దారుణమైన పరిస్థితి నెలకొంది..

* ఇప్పుడిప్పుడే ఆప్కోను గాడిలో పెడుతూ, చేనేత సహకార సంఘాల బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం

* యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగంగా చేనేతల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం...

* చేనేతలకు 2014-19 స్వర్ణయుగం

* కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత మరోసారి చేనేత రంగానికి ప్రాధాన్యమిస్తున్నాం

* చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాం

* కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షో రూమ్ ల్లో అమ్మకాలు పెరిగాయి...

* నేతన్నలకు చేనేత వస్త్రాల తయారీలో స్కిల్ పెంచేలా శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నాం .. 

* ఎక్కడికక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం...

* చేనేతల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది...

Search
Categories
Read More
Andhra Pradesh
అయోధ్య శ్రీరాముని విగ్రహావిష్కరణ ప్రాణ ప్రతిష్టాపన నేటికి రెండేళ్లు
*ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముని (రాం ల‌ల్లా) విగ్రహ...
By Rajini Kumari 2026-01-22 12:17:19 0 129
Andhra Pradesh
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
By Ratna Sekhar 2026-02-19 19:01:22 0 67
Andhra Pradesh
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో...
By Boiena Rajesh 2026-04-02 00:09:02 0 69
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com