ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన

0
154

*ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, నేతన్నల అభివృద్ధికి తీసుకున్న చర్యలపై చీరాల ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కింది విధంగా స్పందించారు...*

 

* చీరాల చేనేత క్లస్టర్ కు ఎన్.ఆర్.ఎల్.ఎం కింద రూ.4.17 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

* ఆప్కో, చేనేత సంఘాలు విక్రయించిన వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం

* చేనేత సంక్షేమానికి త్రిఫ్ట్ పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరపతి పథకాలు అమలు చేస్తున్నాం. త్వరలో నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు చేయబోతున్నాం..

* జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి)లో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు నిర్ణయించడమైనది

* పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించాం...

* రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం(ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లు మంజూరు చేశాం..

* సహాయక క్లస్టర్లతో పాటు ఇతలర క్లస్టర్లకు ఆర్థిక సాయం చేస్తున్నాం..

* ముడి పదార్థాల సరఫరా పథకం, నేత కార్మికులకు ముద్రా పథకం అమలు చేస్తున్నాం

* చేనేత వస్త్రాల అమ్మకం పెంచేలా ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు ఏర్పాటుచేస్తున్నాం..

* గత ప్రభుత్వం చిన్న సంస్థ అయిన ఆప్కోను కూడా విడిచిపెట్టలేదు...

* ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్లు పక్కదారి పట్టించడం వల్ల ఆ సంస్థలో దారుణమైన పరిస్థితి నెలకొంది..

* ఇప్పుడిప్పుడే ఆప్కోను గాడిలో పెడుతూ, చేనేత సహకార సంఘాల బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం

* యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగంగా చేనేతల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం...

* చేనేతలకు 2014-19 స్వర్ణయుగం

* కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత మరోసారి చేనేత రంగానికి ప్రాధాన్యమిస్తున్నాం

* చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాం

* కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షో రూమ్ ల్లో అమ్మకాలు పెరిగాయి...

* నేతన్నలకు చేనేత వస్త్రాల తయారీలో స్కిల్ పెంచేలా శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నాం .. 

* ఎక్కడికక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం...

* చేనేతల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది...

Search
Categories
Read More
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:33:53 0 136
Telangana
సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల...
By Gujile Ramu 2026-04-27 23:47:02 0 96
Andhra Pradesh
Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి.
  Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు:...
By Pagadala Venkateswar 2026-01-29 07:31:16 0 124
Andhra Pradesh
గుంటూరు నల్లపాడు డిసిసిబి మేనేజర్ అరుణ్ కుమారి అరెస్ట్
గత ప్రభుత్వం వైసిపి పాలకుల అండతో అక్రమాలు పాల్పడిన వైకాపా నేతలు అవకతవకలు పాల్పడ్డారు ఓటమి...
By KOTESWARARAO KVSR 2025-12-22 05:57:19 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com