కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం గద్దె క్రాంతి కుమార్

0
102

*కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం*

 

      *టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*

 

 

            పార్టీకి ప్రాణం, నాయకత్వానికి బలం కార్యకర్తలని బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ జెండాను గర్వంగా ఎగరేసేది, ప్రజల మధ్య పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లేది కార్యకర్తలేనని అటువంటి తాము ఎప్పుడు అండగా ఉంటామని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.

 

            సోమవారం ఉదయం 19వ డివిజన్ జార్జిపేట ఏరియాలో గద్దె క్రాంతి కుమార్ పర్యటించి, పార్టీ కార్యకర్త వల్లభదాసు శాయమ్మ మనవరాలు వల్లభదాసు వినీతకు కాలేజీ ఫీజులు నిమిత్తం 20 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గద్దె క్రాంతి సొంత నిధులు నుంచి అందజేశారు.

 

             ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనూ, సాధారణ రోజుల్లోనూ, ప్రజా సమస్యలపై పోరాటాల్లోనూ ముందుండేది కార్యకర్తలే అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యకర్తకు కష్టం వస్తే అది పార్టీకి వచ్చిన కష్టంగా భావిస్తూ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని పరిస్థితులు — ఏదైనా ఎదురైనా ముందుండి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కార్యకర్త కుటుంబం సురక్షితంగా, బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త గౌరవం కాపాడటం, వారి కృషిని గుర్తించడం, అవసరమైన సమయంలో తోడుగా నిలవడం నాయకులు బాధ్యత అన్నారు. పార్టీకి కార్యకర్తలే మా అసలు సంపద అని వారి త్యాగం, నిబద్ధత, విశ్వాసమే పార్టీ విజయానికి పునాదని కార్యకర్తల కుటుంబం అంటే మా కుటుంబమే అన్న భావంతో ఎల్లప్పుడూ వారితో ఉంటామని గద్దె క్రాంతి అన్నారు.

 

             ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భాగం సాయి ప్రసాద్, ఎస్. ఫిరోజ్, పరిసపోగు విజయ్, దూపాటి శాంతకుమారి, ఒలేటి పావని, పల్లి మాధవి, కొండపల్లి రమేష్ తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 161
Andhra Pradesh
కర్నూలు జిల్లా కురవ సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన కర్నూలు ఎంపీ !!
కర్నూలు : కర్నూలు నగరంలోని పెద్దపాడు రోడ్డు లో గల శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి...
By Hari Krishna 2025-12-29 10:52:45 0 173
Telangana
కడెం : 'మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి'
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కడెం...
By Mittapelli Saketh 2026-02-03 06:18:32 0 210
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com