బీసీల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయం

0
124

*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*

 

బిసిల‌ అభ్యున్నతికి ఐలాపురం వెంక‌య్య‌ చేసిన సేవలు చిరస్మరణీయం

 

ఐలాపురం వెంక‌య్య కుటంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

 

వెంక‌య్య కుటుంబానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రగాఢ సానుభూతి

 

 

విజ‌య‌వాడ : ఇటీవ‌ల మృతి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు, వ్యాపార‌వేత్త‌, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (96) కుటుంబ సభ్యుల్ని ఎంపీ కేశినేని శివనాథ్ సోమ‌వారం పరామర్శించారు. దుర్గా ఆగ్ర‌హ‌రంలోని ఆయ‌న నివాసానికి వెళ్లి ఆయ‌న కుమారులు ఐలాపురం రాజ‌, ఐలాపురం అరుణ్ కుమార్ ల‌తో పాటు ఇత‌ర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియపర్చి,ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్బంగా వ్యాపార‌వేత్త‌గా హోట‌ల్ రంగంలో, బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కొనియాడారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమ‌న్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, టి.ఎన్.ఎస్.ఎఫ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు: బాణాసంచాతో ఆకాశం మెరిసింది.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బి.టీ కాలేజ్ గ్రౌండ్ నందు "మా" టపాసులు...
By Pagadala Venkateswar 2026-01-27 07:12:56 0 131
Andhra Pradesh
నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన...
By Benguluri Madhubabu 2026-01-23 06:21:00 0 236
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయ ప్రతిష్ట పారిశుద్ధ్య కార్మికులు చేతిలోనే ఉంది ఈవో సీనా నాయక్
పత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రి, 22 జనవరి 2026   దేవాలయ ప్రతిష్ట పారిశుధ్య కార్మికుల...
By Rajini Kumari 2026-01-22 12:20:37 0 162
Andhra Pradesh
ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష మోసం: మేజారి మురళీధర్‌పై సత్య ఆరోపణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష తీసుకుని మోసం చేశాడని మేజారి...
By Pagadala Venkateswar 2026-05-01 04:04:53 0 67
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ఈస్టిపేట లో విచక్షణ రహితంగా యువకుడు పై దాడి.
పుంగనూరు ఈస్ట్ పేటలో మద్యం ఇవ్వలేదన్న కారణంతో మధు, రవి బ్యాచ్ యువకుడిపై విచక్షణారహితంగా దాడి...
By Kothuru Murali 2026-01-25 11:58:03 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com