YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.

0
158

రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి!

ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ

 

ఒకే పాల వ్యాపారి నుంచి పాలు కొన్న బాధితులు

పలువురి పరిస్థితి విషమం.. ఆసుపత్రిలో చికిత్స

రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి నలుగురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఆహార భద్రత అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని జగన్ ఆరోపించారు. ఈ దారుణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.

 

బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగాలని, అవసరమైతే నిపుణులైన వైద్య బృందాలను పంపాలని జగన్ కోరారు. ఆహార భద్రత తనిఖీలను కట్టుదిట్టం చేసి, పాల వంటి నిత్యావసరాలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.

 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా నలుగురు మరణించారు. మూత్రం రాకపోవడం (అనూరియా) లక్షణాలతో వీరు మృతి చెందగా, దీనికి కల్తీ పాలే కారణమని అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి ఎస్. శేషగిరిరావు (72), రాధా కృష్ణమూర్తి (74) మరణించారు. అంతకుముందు మరో ఇద్దరు చనిపోయారు.

 

ఈ నెల‌ 15 నుంచి సుమారు 14 మంది అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. బాధితులంతా ఒకే పాల వ్యాపారి వద్ద పాలు కొనుగోలు చేయడంతో కల్తీ జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా...
By Pagadala Venkateswar 2026-04-27 05:45:01 0 93
Andhra Pradesh
రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ !! కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...* వడ్డే తులసి కుమార్ పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారి...*...
By Hari Krishna 2025-12-27 16:18:03 0 198
Mizoram
Assam Rifles Seize Rs 113 Crore Drugs and 7,000 Detonators in Mizoram
In a major anti-narcotics operation in Mizoram’s border region, Assam Rifles recovered...
By Bharat Aawaz 2025-07-17 07:06:14 0 1K
Andhra Pradesh
ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన.
  ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన...
By Pagadala Venkateswar 2026-06-06 06:09:07 0 83
Andhra Pradesh
పుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బుధవారం జాతీయ మానవ హక్కుల సంఘం...
By Kothuru Murali 2026-02-04 16:18:18 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com