కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!

0
437

కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఒకప్పటి వెండితెర నటి, సోషల్ మీడియా స్టార్ విష్ణుప్రియ తండ్రి, తెలంగాణ వ్యాపారవేత్త సూర్యనారాయణ హత్యోదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన దాడి కాదని.. ఒక వివాహేతర సంబంధం, ఆపై జరిగిన హత్య, దానికి బదులుగా జరిగిన ప్రతీకార హత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

పర్యాటక కేంద్రమైన తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఒక భయంకరమైన హత్యోదంతం వెలుగుచూసింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి విష్ణుప్రియ తండ్రి అయిన సూర్యనారాయణ (73) తన సొంత బంగళాలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఇది సాధారణ హత్య కాదని.. పక్కా ప్లాన్‌తో జరిగిన ప్రతీకార దాడి అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కుర్చీకి కట్టేసి.. నోటికి టేపులు వేసి..

పోలీసుల కథనం ప్రకారం.. కొడైకెనాల్‌లోని కురింజి ఆండవర్ టెంపుల్ రోడ్డులో సూర్యనారాయణకు ఒక విలాసవంతమైన బంగళా ఉంది. ఆదివారం తెల్లవారుజామున పలువురు దుండగులు.. దొంగతనంగా ఇంట్లోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లగానే అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులను, యజమాని సూర్యనారాయణను బలవంతంగా మూడు కుర్చీల్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేశారు.

అనంతరం సూర్యనారాయణ అరవకుండా ఉండేందుకు హెవీ డ్యూటీ ప్యాకింగ్ టేపులతో ముఖం, నోటిని గట్టిగా చుట్టేశారు. ఈక్రమంలోనే ఆయన ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సూర్యనారాయణ వద్ద పనిచేసే అసిస్టెంట్ ఒకరు ఎలాగోలా తాళ్లను విప్పుకుని.. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు.
డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు Andhra Chandrababu Naidu Orders...
By Pagadala Venkateswar 2026-05-30 05:19:43 0 62
Telangana
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని...
By Pinnehasan Odela 2026-01-15 14:40:44 0 247
SURAKSHA
Munna Prasad Gupta, IPS: Leading with Courage & Commitment
The Journey Begins "The true strength of policing lies in protecting every...
By Fathima Safa 2026-07-23 04:18:16 0 20
Andhra Pradesh
జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం
జనసేన నాయకుల మానవతా    ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల...
By Chennaiah Kati 2026-01-27 16:05:16 0 192
Andhra Pradesh
పుంగనూరు:శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో రక్తదానం శిబిరం జరిగినది, రక్తదానం చేసి ప్రాణదాతలు కండి.
పుంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-30 15:13:46 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com