కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!

0
241

కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఒకప్పటి వెండితెర నటి, సోషల్ మీడియా స్టార్ విష్ణుప్రియ తండ్రి, తెలంగాణ వ్యాపారవేత్త సూర్యనారాయణ హత్యోదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన దాడి కాదని.. ఒక వివాహేతర సంబంధం, ఆపై జరిగిన హత్య, దానికి బదులుగా జరిగిన ప్రతీకార హత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

పర్యాటక కేంద్రమైన తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఒక భయంకరమైన హత్యోదంతం వెలుగుచూసింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి విష్ణుప్రియ తండ్రి అయిన సూర్యనారాయణ (73) తన సొంత బంగళాలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఇది సాధారణ హత్య కాదని.. పక్కా ప్లాన్‌తో జరిగిన ప్రతీకార దాడి అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కుర్చీకి కట్టేసి.. నోటికి టేపులు వేసి..

పోలీసుల కథనం ప్రకారం.. కొడైకెనాల్‌లోని కురింజి ఆండవర్ టెంపుల్ రోడ్డులో సూర్యనారాయణకు ఒక విలాసవంతమైన బంగళా ఉంది. ఆదివారం తెల్లవారుజామున పలువురు దుండగులు.. దొంగతనంగా ఇంట్లోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లగానే అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులను, యజమాని సూర్యనారాయణను బలవంతంగా మూడు కుర్చీల్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేశారు.

అనంతరం సూర్యనారాయణ అరవకుండా ఉండేందుకు హెవీ డ్యూటీ ప్యాకింగ్ టేపులతో ముఖం, నోటిని గట్టిగా చుట్టేశారు. ఈక్రమంలోనే ఆయన ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సూర్యనారాయణ వద్ద పనిచేసే అసిస్టెంట్ ఒకరు ఎలాగోలా తాళ్లను విప్పుకుని.. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు...
By Pagadala Venkateswar 2026-02-26 11:32:32 0 70
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-14 14:16:10 0 233
Telangana
TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు....
By Veeresh Kumar 2026-03-27 13:01:13 0 214
Andhra Pradesh
రెండు రోజులు పాటు జరగనున్న బిజెపి సమ్మేళనం ముస్తాబైన విజయవాడ
విజయవాడ వేదికగా చారిత్రక స్మృతులు *రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి విజయవాడ...
By Rajini Kumari 2026-01-22 12:31:36 0 148
Andhra Pradesh
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
By Mobbu Venkatramana 2026-03-03 08:10:38 1 172
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com