నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.

0
76

బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మధుసూదన రావు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో యువజన సర్వీసుల, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ, 1846లోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అణచివేతను ఎదిరించి పోరాడిన మహోన్నత వ్యక్తి నరసింహారెడ్డి అని కొనియాడారు. ఆయన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి....
By Kothuru Murali 2026-02-11 08:48:19 0 94
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి - కలెక్టర్.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)'లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-03 05:35:37 0 85
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ
అల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ...
By Sidhu Maroju 2025-06-02 16:47:24 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com