పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు.
చీరాల: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చీరాల పట్టణంలో శనివారం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యర్థ రహిత పాలన అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. వీధులలో వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. మార్గమధ్యంలో టిఫిన్ సెంటర్ లు, హోటళ్ల వద్ద పరిశుభ్రతపై నిర్వాహకులకు ఆర్డీవో టి.చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. అనంతరం సమైక్యతను చాటుతూ పాఠశాలలో మానవహారం నిర్వహించారు. నా ఇంటిని, పరిసరాలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచుతానంటూ అందరి చేత ఇంచార్జి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈనెల 26వ తేదీన రేపల్లెలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రాలను జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట విడుదల చేశారు.
మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే వీధులను శుభ్రంగా ఉంచాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట చెప్పారు. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz