పాత ఇంటి యజమాని దాస్తీకం- మనోవేదనతో యువతి ఆత్మహత్య .|

1
320

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పాత ఇంటి యజమాని పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆల్వాల్  పోలీస్  స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

 

హస్మత్‌పేట్‌లోని మాలా బస్తీకి చెందిన షేక్ సాబర్ (46), పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య తబస్సుమ్ (62). వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. గత 21 ఏళ్లుగా హస్మత్‌పేట్‌లోని అబ్రహార్ మసీదు సమీపంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న ఈ కుటుంబం, రెండు రోజుల క్రితమే మాలా బస్తీలోని కొత్త ఇంటికి మారింది.

 

ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో, తబస్సుమ్ పాత ఇంట్లో మిగిలిపోయిన బట్టలు, సామాన్లు శుభ్రం చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంటి యజమాని మోటార్ పాడైందని, అడ్వాన్స్ డబ్బుల విషయంలో తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, అంతేకాకుండా భర్త ఇంట్లో లేని సమయంలో తలుపులు కొట్టి లోపలికి వస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తన భర్తకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపింది.

 

యజమాని వేధింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన తబస్సుమ్, అదే రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో పాత ఇంటి వంటగదిలో ఇనుప పైపుకు చున్నీతో ఉరివేసుకుంది.

గమనించిన షేక్ యాకూబ్ అనే వ్యక్తి ఆమెను కిందికి దించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త షేక్ సాబర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తన భార్య మరణానికి కారణమైన ఇంటి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను కోరుతోంది..

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం
కృష్ణా జిల్లా పోలీస్    *మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక...
By Rajini Kumari 2026-02-23 14:11:57 0 126
Andhra Pradesh
మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.
మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-20 09:40:25 0 98
Andhra Pradesh
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
By Kothuru Murali 2026-01-20 13:35:21 0 134
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్,...
By John Baji 2026-01-21 11:15:32 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com