రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక
రబీ సీజన్లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరో 500 టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 4,924 టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. అదనంగా 207 లీటర్ల నానో యూరియా కూడా అందుబాటులో ఉందని చెప్పారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు), రైతు సేవా కేంద్రాలు మరియు ప్రైవేటు డీలర్ల ద్వారా యూరియాను సరఫరా చేయనున్నట్లు వివరించారు. రైతులు అధికారిక కేంద్రాల ద్వారా మాత్రమే ఎరువులను కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రబీ పంటల సాగులో అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy