రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక

0
18

రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరో 500 టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 4,924 టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. అదనంగా 207 లీటర్ల నానో యూరియా కూడా అందుబాటులో ఉందని చెప్పారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు), రైతు సేవా కేంద్రాలు మరియు ప్రైవేటు డీలర్ల ద్వారా యూరియాను సరఫరా చేయనున్నట్లు వివరించారు. రైతులు అధికారిక కేంద్రాల ద్వారా మాత్రమే ఎరువులను కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రబీ పంటల సాగులో అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
NVIDIA in AP
NVIDIA has come forward to work with the AP government to create an AI ecosystem in Andhra...
By Terli Ashok 2026-01-25 05:27:57 0 114
Andhra Pradesh
ముద్రగడ నివాసానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్...
ఈ రోజు కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ...
By BABJI DADALA 2025-12-23 14:50:53 0 261
Andhra Pradesh
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: డిఐజీ కర్నూల్ ఇన్చార్జి ఎస్పి
కర్నూలు :కర్నూలు జిల్లా... సంక్రాంతి పండగ ఆఫర్లు అంటూ సైబర్ మోసాలు...ఫేక్ షాపింగ్ ల ఆఫర్లు,...
By Hari Krishna 2026-01-09 11:15:47 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com