ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ

0
2K

పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పాటు అందులో ఉంచిన సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు నగలు, ఒక కిలో వెండి వస్తువులు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై మంగళవారం పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ విజయ్ శంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మౌనిక తెలిపారు.

పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో ఎం.శ్రీను హెచ్చరించారు....
By Boiena Rajesh 2026-04-29 04:29:13 0 218
Telangana
రాజాపేట లో దారుణ హత్య
రాజాపేట గ్రామానికి చెందిన జిడ్డు నాని అనే యువకుడు  తన స్నేహితుడు అయిన తాళ్లపల్లి చందు ని...
By Pindikura Mahesh 2026-05-01 16:56:12 0 257
Bharat Aawaz
THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:39:42 0 1K
SURAKSHA
సైబర్ నేరాల నివారణ - అవగాహన
చిత్రంలో చూపినట్లుగా, సమాజంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరం....
By Kalaga Sailaja 2026-06-29 07:53:08 0 86
Andhra Pradesh
స్లగ్: ఘనంగా భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ లో వార్షికోత్సవం...
స్థలం:చీరాల చీరాల పట్టణంలోని భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్...
By Vadlamudi NagaVenkat 2026-04-24 11:14:01 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com