శాంతి భద్రతల కోసమే ‘పల్లెనిద్ర’ – సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట పోలీసు విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం రాత్రి సామర్లకోట మండలం నవర గ్రామంలో సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులతో కలిసి ‘పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు.
గ్రామస్తులతో నేరుగా మమేకమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రజల సహకారం లేకుండా శాంతి భద్రతలను కాపాడడం సాధ్యం కాదని సీఐ పేర్కొన్నారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
అలాగే సైబర్ మోసాలు, చోరీలు, మద్యం దుర్వినియోగం వంటి అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. యువత మంచి మార్గంలో నడవాలని, చట్టానికి విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
‘పల్లెనిద్ర’ వంటి కార్యక్రమాలు పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు అభిప్రాయపడ్డారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ పోలీసులకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు పలువురు యువకులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz