• కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
    సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనం తీవ్రత ప్రాంతమంతా కంపించింది. స్థానికుల కథనం ప్రకారం పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ...
    0 Comments 0 Shares 506 Views 0 Reviews
  • వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ
    వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున వైస్ ప్రెసిడెంట్ రత్న శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పేలుడు తీవ్రత కారణంగా పొలాల గట్ల వెంట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించే ప్రక్రియలో అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఘటనాస్థలంలో ఉన్న గ్రామస్తులను...
    0 Comments 0 Shares 498 Views 0 Reviews
  • బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్
    కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ విషాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన, ప్రాథమిక నివేదికల ఆధారంగా బాధ్యతా రాహిత్యం వహించిన అధికారులపై చర్యలు ప్రకటించారు. పెద్దాపురం ఆర్డీఓ, సంబంధిత డిఎస్పీ, జిల్లా కార్మికశాఖ అధికారి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సహా నలుగురు అధికారులను సస్పెండ్...
    0 Comments 0 Shares 549 Views 0 Reviews
  • బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్
    కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో గాయపడి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్షతగాత్రికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని,...
    0 Comments 0 Shares 524 Views 0 Reviews
  • బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
    వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పరామర్శించారు. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను పరిశీలించిన సీఎం, బాధిత కుటుంబ సభ్యులను కలసి ఓదార్చారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో...
    0 Comments 0 Shares 436 Views 0 Reviews
  • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ
    వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి...
    0 Comments 0 Shares 455 Views 0 Reviews
  • వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
    వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను...
    0 Comments 0 Shares 335 Views 0 Reviews
  • వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ
    సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మరియు...
    0 Comments 0 Shares 427 Views 0 Reviews
  • వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం
    వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా...
    0 Comments 0 Shares 338 Views 0 Reviews
  • వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్
    సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం...
    1 Comments 0 Shares 412 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com