మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ

0
1K

వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలవాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Expands Education and Skill Development
Uttarakhand continues to strengthen its education system by upgrading school infrastructure,...
By Fathima Safa 2026-06-27 07:44:15 0 49
Andhra Pradesh
ఫిబ్రవరి 11 న శాసన సభ సమా వేశాలు
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సమా వే శాలు ఫిబ్రవ రీ 11 నుండి జరుగనున్న యని అధి కా రీ కంగా రాష్ట్ర...
By Mobbu Venkatramana 2026-02-01 11:36:04 0 442
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.
ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు...
By Boya Dasthagiri 2026-04-02 10:17:01 0 190
Andhra Pradesh
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి...
By Pagadala Venkateswar 2026-03-18 03:06:58 0 169
Telangana
యువత సన్మార్గంలో పయనించాలి
జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్...
By Thativar Shivaji 2026-02-14 10:50:03 0 426
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com