మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ

0
860

వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలవాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు.
మంగళగిరిలో ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-03-21 06:15:15 0 134
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్.
సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్...
By Pagadala Venkateswar 2026-04-27 06:17:46 0 68
Telangana
రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నీటి కష్టాలకు చెక్… శాంతి రెడ్డి సడన్ యాక్షన్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న...
By Sidhu Maroju 2026-04-06 09:53:59 0 160
Andhra Pradesh
మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.
మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు...
By Pagadala Venkateswar 2026-03-21 11:26:31 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com