వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్

1
757

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, ఈ ఘటన అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచేసిందన్నారు.

బాణాసంచా కేంద్రాల్లో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం ప్రాంతంలో జరిగిన ఘటన మరువకముందే వేట్లపాలెంలో మరో దుర్ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

జిల్లాలోని ఫైర్‌వర్క్స్ యూనిట్లలో కార్మిక చట్టాలు, భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి, కొన్ని రోజుల తర్వాత మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ ప్రమాదంపై నిష్పక్షపాత, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే ప్రమాద నివారణలో విఫలమైన సంబంధిత ఫైర్ స్టేషన్, రెవెన్యూ అధికారులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పులి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానన్న మహిళ... స్పందించిన పవన్ కల్యాణ్.
Andhra Pawan Kalyan Responds to Womans Loss of Baby Due to KGH Negligence కేజీహెచ్ వైద్యుల...
By Pagadala Venkateswar 2026-01-31 10:26:59 0 130
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 2K
Telangana
కొత్త రకం దొంగతనాలు :ముగ్గురిని కటకటాల్లోకి నెట్టిన బోయిన్ పల్లి పోలీస్ లు
సికింద్రాబాద్.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు.వెంటనే...
By Sidhu Maroju 2025-06-17 10:46:20 0 1K
Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ వర్క్‌షాప్‌... కార్యకర్తల మధ్యలో కూర్చున్న చంద్రబాబు.
టీడీపీ పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయకులతో కలిసి...
By Pagadala Venkateswar 2026-01-28 07:56:19 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com