గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం

0
67

దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన కుటుంబం జీవనోపాధి కోసం దుమంతులగూడెంకు వలస వచ్చింది. పొగాకు పనులకు వెళ్తున్న సమయంలో బాలిక ట్రాక్టర్‌పై ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో అనుకోకుండా ట్రాక్టర్‌పై నుంచి జారి కిందపడింది.

ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వలస కార్మికులు ట్రాక్టర్‌లపై ప్రయాణించే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Search
Categories
Read More
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:43:13 0 2K
Telangana
బాచుపల్లి అగ్ని ప్రమాదం
Quthbullapur Fire Accident: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ...
By Ponnala Srinivasrao 2026-03-13 06:24:21 0 187
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు
మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. మున్సిపల్...
By Boiena Rajesh 2026-03-21 10:54:58 0 153
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com