రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణ
Posted 2026-02-19 18:49:04
0
499
కాకినాడ రూరల్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నాగమణి విమర్శించారు. కాకినాడ రూరల్లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మదనపల్లె ఘటనపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలికలు, వృద్ధ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళల అదృశ్యాల అంశంపై గతంలో తీవ్రంగా స్పందించిన నాయకులు ప్రస్తుతం మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయంలో విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శరవేగంగా శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి) నిర్మాణ పనులను...
పట్టాభిపురంలో వ్యభిచార నిర్వహణపై టాస్క్ ఫోర్స్ రైడ్
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పండరీపురం, 5వ లైను నందు ఆర్గనైజింగ్ వ్యభిచారం...
Ahmed Nadeem IAS: Leading Governance with Vision
A distinguished Telangana IAS officer whose leadership, administrative expertise, and commitment...
నిజామాబాద్: సీఎస్ఐ చర్చి లో ప్రధానులు
జిల్లా లోని CSI చర్చి లో శుక్రవరం గుడ్ఫారిడే సందర్బంగా ప్రతేక ప్రార్థన లూ...
పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు
మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్...