పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.

0
129

ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపునిచ్చారు. బుధవారం బసినికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ముందుకు వచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపీనాథ్‌ను ఆమె అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛందంగా సేవలు అందించే వారికి కేంద్ర ప్రభుత్వం ధ్రువపత్రం అందజేస్తుందని తెలిపారు.

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com