Ramzan starts from tomorrow

0
148

*_ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్_*

 

_ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు._

 

_అయితే రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభం కావడం విశేషం. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే._

 

_ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్ర పండుగా భావించే రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. పవిత్ర మక్కా మసీదు నెలకున్న సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి నుంచి అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అలాగే సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధృవీకరించింది. భారత్ లో సౌదీ ప్రకటనను అనుసరిస్తారు కాబట్టి ఇక్కడ కూడా రంజాన్ మాసం ప్రారంభం అయినట్టుగా భావించవచ్చు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు._

 

_మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఈ మేరకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ముస్లిం ఉద్యోగులు తమ విధులను సాయంత్రం 4 గంటలకే ముగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు._

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి ......!
విద్యార్థులకు GOOD NEWS.. 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్న CM... భారత్ అవాజ్ న్యూస్: 11 మే రోజున......
By Gujile Ramu 2026-05-11 16:05:16 0 102
Andhra Pradesh
పులి కల్లు లో శ్రీరామ నవమి సంబరాలు
మదన పల్లి జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం పులి కల్లు.లో శ్రీరామ నవమి పండుగ రోజు నుండి వరసగా...
By Mobbu Venkatramana 2026-03-28 16:47:53 0 212
Telangana
జాబ్ ఇస్తామంటూ యువకుడిని మోసం చేసిన సైబర్ గ్యాంగ్.|
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ పరిధిలో మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు....
By Sidhu Maroju 2026-04-08 14:39:01 0 238
Andhra Pradesh
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..
బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర...
By Gadiyapudi Narendra 2026-03-03 05:38:38 0 178
Andhra Pradesh
సరూర్ ఏ ఉర్దూ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేసినేని శివనాథ్
    ఉర్దూ భాష‌ను వృద్ధిలోకి తీసువ‌చ్చింది సీఎం చంద్ర‌బాబు ఒక్క‌డే...
By Rajini Kumari 2025-12-30 09:58:47 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com