Ramzan starts from tomorrow

0
189

*_ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్_*

 

_ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు._

 

_అయితే రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభం కావడం విశేషం. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే._

 

_ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్ర పండుగా భావించే రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. పవిత్ర మక్కా మసీదు నెలకున్న సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి నుంచి అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అలాగే సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధృవీకరించింది. భారత్ లో సౌదీ ప్రకటనను అనుసరిస్తారు కాబట్టి ఇక్కడ కూడా రంజాన్ మాసం ప్రారంభం అయినట్టుగా భావించవచ్చు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు._

 

_మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఈ మేరకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ముస్లిం ఉద్యోగులు తమ విధులను సాయంత్రం 4 గంటలకే ముగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు._

Search
Categories
Read More
Andhra Pradesh
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు.
గురువారం రాత్రి కర్ణాటకలోని మంచినీళ్లకోట వద్ద బెంగళూరు నుండి మదనపల్లె వస్తున్న SLT బస్సు,...
By Pagadala Venkateswar 2026-06-12 04:35:33 0 91
Andhra Pradesh
నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం...
By Pagadala Venkateswar 2026-02-17 05:20:11 0 253
Andhra Pradesh
పాలెంకొండలో మహిళపై దాయాదుల దాడి.. కేసు నమోదు.
మదనపల్లె మండలం పాలెంకొండ గ్రామంలో గురువారం ప్రేమకుమారి అనే మహిళపై దాయాదులు మూకుమ్మడిగా దాడి...
By Pagadala Venkateswar 2026-06-19 04:43:33 0 76
Madhya Pradesh
Healthcare Infrastructure and Public Health in Madhya Pradesh
Madhya Pradesh is strengthening its healthcare system through the expansion of medical...
By Fathima Safa 2026-06-23 07:25:38 0 177
West Bengal
West Bengal Strengthens Law and Order Across the State
West Bengal continues to reinforce its law and order framework through enhanced policing,...
By Fathima Safa 2026-07-02 05:55:20 0 30
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com