తిరునాళ్ళలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా పోలీస్ అధికారులు.
Posted 2026-02-17 16:05:42
0
205
బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చీరాల డీఎస్పీ ఎమ్.డి.మోయిన్ ఆధ్వర్యంలో చిన్నగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా స్థానిక పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో వేరువేరు ఘటనలలో తప్పిపోయిన చిన్నపిల్లలను చీరాల డిఎస్పీ గారు క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. శివరాత్రి నాడు భట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలోని శ్రీ కేదారేశ్వర వాయులింగ దేవస్థానం వద్ద భట్టిప్రోలు ఎస్ఐ శివయ్య గారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో ముగ్గురు చిన్నపిల్లలు వేరువేరుగా సంఘటనలలో తప్పుపోయినారు. సమాచారం తెలుసుకున్న భట్టిప్రోలు ఎస్ఐ వేగంగా స్పందించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారిని గుర్తించి.. క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు
కృష్ణాజిల్లా పోలీస్
*గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా...
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన
పుంగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన...
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో...
డ్రైవర్ ఆత్మహత్య..కుటుంబానికి 10 లక్షలు, ఉద్యోగం
తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం...
టామ్కామ్ను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 20: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర...