తిరునాళ్ళలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా పోలీస్ అధికారులు.

0
32
 
బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చీరాల డీఎస్పీ ఎమ్.డి.మోయిన్ ఆధ్వర్యంలో చిన్నగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా స్థానిక పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో వేరువేరు ఘటనలలో తప్పిపోయిన చిన్నపిల్లలను చీరాల డిఎస్పీ గారు క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. శివరాత్రి నాడు భట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలోని శ్రీ కేదారేశ్వర వాయులింగ దేవస్థానం వద్ద భట్టిప్రోలు ఎస్ఐ శివయ్య గారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో ముగ్గురు చిన్నపిల్లలు వేరువేరుగా సంఘటనలలో తప్పుపోయినారు. సమాచారం తెలుసుకున్న భట్టిప్రోలు ఎస్ఐ వేగంగా స్పందించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారిని గుర్తించి.. క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. అది మళ్లీ వచ్చేసింది.. ఇక పండగే
తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త. హైదరాబాద్ నుంచి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది....
By Pagadala Venkateswar 2026-01-05 06:51:25 0 138
Music
Shankar Mahadevan Collaborates with Google to Create AI-Generated Song Using Lyria
Shankar Mahadevan Collaborates with Google to Create AI-Generated Song Using Lyria Celebrated...
By BMA ADMIN 2025-05-22 17:13:18 0 2K
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?...
By Gadiyapudi Narendra 2026-02-04 16:48:11 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com