రాణి గారి తోట వాటర్ ట్యాంకులు త్వరలో ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి

0
200

*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*

*17-02-2026*

 

 

 

*రాణి గారి తోట లోగల వాటర్ ట్యాంక్ నీరు ను ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి*

 

 

*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*

 

 

 

రాణి గారి తోట లోగల నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ను త్వరగా పూర్తిచేసి, అందుబాటులో తీసుకొచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాణి గారి తోట, కృష్ణలంక ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాణి గారి తోట లో నిర్మిస్తున్న 1000 కి.లీ . సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసి ప్రజలకు త్వరగా మంచినీటి సరఫరా ఆ ట్యాంకు ద్వారా అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 పథకం కింద చేస్తున్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని అన్నారు. కృష్ణలంక నేషనల్ హైవే లో గ్రీన్ బెల్ట్ ను పెంచాలని ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

 తదుపరి రాణి గారి తోటలో గల అన్న క్యాంటీను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి, వాడుకనీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఏవైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.

 

 

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే షమ్మీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు
పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది...
By Kothuru Murali 2026-03-17 07:06:10 0 155
Andhra Pradesh
మదనపల్లిలో హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం.
మదనపల్లి పట్టణం నీరుగట్టుపల్లిలో సోమవారం హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. శివరాత్రి...
By Pagadala Venkateswar 2026-02-17 05:21:50 0 162
Andhra Pradesh
ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్
*ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్*   *విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో...
By Rajini Kumari 2026-01-23 11:53:18 0 209
Bharat Aawaz
Celebrating National Handloom Day – Honouring the Threads of India’s Soul
August 7 is not just a date it’s a tribute to the millions of weavers and artisans who...
By Bharat Aawaz 2025-08-07 09:24:30 0 890
Telangana
1వ వార్డులో పర్యటించిన కౌన్సిలర్ జాడి వినోద్ పేదల సమస్యల పరిష్కారమే ధ్యేయం
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూలై 1, 2026: స్థానిక...
By Chunarkar Jagadeesh 2026-07-01 05:40:09 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com