వైభవంగా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

0
425

​- పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ సీతక్క ​

మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 16(భారత్ అవాజ్)తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొత్తగూడ మండలం శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర మహోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, ఆర్ అండ్ బి శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఘనంగా ఆవిష్కరించి ​జాతర ముఖ్య తేదీలను ప్రకటించారు.​వచ్చే మార్చి నెలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర జరగనుంది. జాతర వివరాలు ఇలా ఉన్నాయి: ​మార్చి 04 ముత్యాలమ్మకు బోనాలు సమర్పించుట. ​మార్చి 05 అమ్మవారిని వనం నుండి గద్దె మీదకు తీసుకురావడం (ప్రధాన ఘట్టం). ​మార్చి 06 భక్తుల మొక్కుల చెల్లింపు, అనంతరం అమ్మవారి తిరుగు ప్రయాణం (వన ప్రవేశం).​ఈ కార్యక్రమంలో జాతర ఇంచార్జ్ ఈవో అనిల్ కుమార్, ఆలయ ప్రధాన పూజారి తోలేం చిన్న నర్సయ్య,తోలం కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు, వెంకన్న, కిరణ్ కుమార్, రాంబాబు, నవీన్ పాల్గొన్నారు. అలాగే ఆలయ సిబ్బంది బట్టు వెంకన్న, గుంజేడు సర్పంచ్ తోలం అనంతరావు, బుర్కా నరేందర్, మల్లేష్, బీజ్జ సందీప్ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చిలకవారి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది....
By Kothuru Murali 2026-02-12 14:00:35 0 107
Andhra Pradesh
పుంగనూరులో నుజ్జు నజ్జు అయిన ద్విచక్ర వాహనం
శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న...
By Kothuru Murali 2026-01-17 12:44:22 0 99
Telangana
మీరు "ఇస్తామంటే  మేము వద్దంటామా "
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3...
By Ponnala Srinivasrao 2026-03-12 13:47:33 0 206
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com