వైభవంగా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

0
543

​- పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ సీతక్క ​

మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 16(భారత్ అవాజ్)తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొత్తగూడ మండలం శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర మహోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, ఆర్ అండ్ బి శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఘనంగా ఆవిష్కరించి ​జాతర ముఖ్య తేదీలను ప్రకటించారు.​వచ్చే మార్చి నెలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర జరగనుంది. జాతర వివరాలు ఇలా ఉన్నాయి: ​మార్చి 04 ముత్యాలమ్మకు బోనాలు సమర్పించుట. ​మార్చి 05 అమ్మవారిని వనం నుండి గద్దె మీదకు తీసుకురావడం (ప్రధాన ఘట్టం). ​మార్చి 06 భక్తుల మొక్కుల చెల్లింపు, అనంతరం అమ్మవారి తిరుగు ప్రయాణం (వన ప్రవేశం).​ఈ కార్యక్రమంలో జాతర ఇంచార్జ్ ఈవో అనిల్ కుమార్, ఆలయ ప్రధాన పూజారి తోలేం చిన్న నర్సయ్య,తోలం కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు, వెంకన్న, కిరణ్ కుమార్, రాంబాబు, నవీన్ పాల్గొన్నారు. అలాగే ఆలయ సిబ్బంది బట్టు వెంకన్న, గుంజేడు సర్పంచ్ తోలం అనంతరావు, బుర్కా నరేందర్, మల్లేష్, బీజ్జ సందీప్ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన...
By Sidhu Maroju 2025-11-12 16:09:51 0 275
Andhra Pradesh
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో...
By Chennaiah Kati 2026-01-19 16:31:31 0 339
Telangana
"వార్డు మెంబర్ నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరకు: వెంకటేశం గుప్తా విజయ ప్రస్థానం.|
మెదక్ జిల్లా: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కాళ్లకల్ గ్రామానికి చెందిన ప్రముఖ...
By Sidhu Maroju 2026-05-02 09:44:02 0 266
Telangana
నిజామాబాద్
డివిజన్లో శిథిలావస్థలో ఉన్నటువంటి కరెంటు పోల్ లను TGNPDCL A E గారితో కలిసి, పర్యవేక్షించి...
By Sadaq Sadaq 2026-06-18 03:53:45 0 132
Andhra Pradesh
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ.
ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-04-13 05:52:43 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com