వైభవంగా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

0
140

​- పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ సీతక్క ​

మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 16(భారత్ అవాజ్)తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొత్తగూడ మండలం శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర మహోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, ఆర్ అండ్ బి శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఘనంగా ఆవిష్కరించి ​జాతర ముఖ్య తేదీలను ప్రకటించారు.​వచ్చే మార్చి నెలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర జరగనుంది. జాతర వివరాలు ఇలా ఉన్నాయి: ​మార్చి 04 ముత్యాలమ్మకు బోనాలు సమర్పించుట. ​మార్చి 05 అమ్మవారిని వనం నుండి గద్దె మీదకు తీసుకురావడం (ప్రధాన ఘట్టం). ​మార్చి 06 భక్తుల మొక్కుల చెల్లింపు, అనంతరం అమ్మవారి తిరుగు ప్రయాణం (వన ప్రవేశం).​ఈ కార్యక్రమంలో జాతర ఇంచార్జ్ ఈవో అనిల్ కుమార్, ఆలయ ప్రధాన పూజారి తోలేం చిన్న నర్సయ్య,తోలం కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు, వెంకన్న, కిరణ్ కుమార్, రాంబాబు, నవీన్ పాల్గొన్నారు. అలాగే ఆలయ సిబ్బంది బట్టు వెంకన్న, గుంజేడు సర్పంచ్ తోలం అనంతరావు, బుర్కా నరేందర్, మల్లేష్, బీజ్జ సందీప్ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.   మల్కాజ్ గిరి కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-23 16:39:39 0 875
Telangana
గణనాథులను దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్...
By Sidhu Maroju 2025-09-01 13:36:51 0 308
Andhra Pradesh
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన వేడుకలు ఘనంగా.
రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ కూడలిలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన...
By Pagadala Venkateswar 2026-02-01 07:47:58 0 27
Andhra Pradesh
పుంగనూరు: శుభారం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన...
By Kothuru Murali 2026-02-03 14:16:04 0 45
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com