నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురాకండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రజలు సమస్యల అర్జీల ను ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు
జాయింట్ కలెక్టర్ భావన,డి ఆర్ ఓ.జి.గంగధర్ గౌడు కలసి అర్జీలని స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
పి జి ఆర్ ఎస్ లో సమస్యల అర్జీలు అందజేసే అందుకు అనారోగ్యంతో బాధపడుతున్న నడవలేని వారిని, మంచాలకు కు పరిమిత అయ్యని వారిని ఎవ్వరూ కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురావద్దని,అలాంటి వారికి సంబంధించిన సమస్యలు ఉంటే వారి తరుపున వారు వచ్చి అర్జీలనుఅందజేయవచ్చునన్నారు.
జిల్లాలోని వివిధ మండలాల నుంచి జిల్లా కలెక్టరేట్ కు పిజిఆర్ ఎస్ లో సమస్యల అర్జీలు అందజేయాడానికి ద్విచక్ర వాహనంపై వచ్చే వారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకొని రావాలన్నారు.
జిల్లా కలెక్టరేట్ తో పాటుగా ప్రతి రెవెన్యూ డివిజన్ లో మరియు మండల తహశీల్దార్లు కార్యాలయాలలో ను తహశీల్దార్లు, ఎంపీ డి ఓ లు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz