Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.

0
177

గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు 

15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం

వాతావరణం మెరుగుపడిన తర్వాత ఏటీసీ సూచనలతో విమానం సురక్షితంగా ల్యాండింగ్  

వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సుమారు 15 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎయిర్ పోర్ట్ రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో ల్యాండింగ్ సమస్య ఎదురైంది. 

 

ఉదయం సమయంలో గన్నవరం పరిసరాల్లో పొగమంచు తీవ్రంగా ఉండటంతో విమానాల రాకపోకలకు అవసరమైన విజిబిలిటీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పటికీ..పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఏటీసీ ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో పైలట్లు విమానాన్ని గాలిలోనే ఉంచి సుమారు 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టించారు. అనంతరం వాతావరణం కాస్త మెరుగుపడడంతో ఏటీసీ సూచనల మేరకు విమానం సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. 

 

ఏపీ ప్రభుత్వంతో సంజీవని వైద్య సేవలతో పాటు కొన్ని కీలక సామాజిక ప్రాజెక్టులపై చర్చల కోసం బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన చేసే ప్రకటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Search
Categories
Read More
Chhattisgarh
CG Cabinet: State Power Firm IPO Gets Nod
The Chhattisgarh government cabinet has given in-principle approval for the Chhattisgarh State...
By Tejaswini Komanduru 2026-06-16 04:59:42 0 194
Telangana
గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు,...
By Ponnala Srinivasrao 2026-07-09 01:46:55 0 121
Andhra Pradesh
నల్లగుంట్ల గ్రామానికి రూ. 2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన- అభివృద్ధి దిశకు మరో ముందడుగు!
నల్లగుంట్ల గ్రామానికి రూ.2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన – అభివృద్ధి దిశగా మరో ...
By Chennaiah Kati 2026-02-11 11:35:08 0 283
Andhra Pradesh
54 మంది లబ్ధిదారులకు 55 లక్షల 84 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచూరు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో గల మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన అండ్...
By Benguluri Madhubabu 2026-06-06 10:00:54 0 147
Delhi - NCR
Delhi-NCR Accelerates Metro and Regional Connectivity
Delhi-NCR is witnessing significant progress in metro expansion and regional connectivity...
By Fathima Safa 2026-06-25 11:45:30 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com