పల్లిపేటలో భారీ అగ్నిప్రమాదం – ఇల్లు పూర్తిగా దగ్ధం

0
231

కాకినాడ : కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్స్‌కు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి
కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి. నూతన...
By Gadiyapudi Narendra 2025-12-27 15:59:07 0 177
Andhra Pradesh
పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా...
By Kothuru Murali 2026-01-30 09:16:16 0 110
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com