పల్లిపేటలో భారీ అగ్నిప్రమాదం – ఇల్లు పూర్తిగా దగ్ధం

0
419

కాకినాడ : కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Karnataka
Bengaluru’s KIA Named World’s 3rd Most Family-Friendly Hub
Bengaluru’s Kempegowda International Airport (KIA) has achieved global acclaim, securing...
By Lokeshwari Panthadi 2026-06-29 06:00:49 0 46
Telangana
నిజామాబాద్
త్యాగానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు...
By Sadaq Sadaq 2026-05-28 04:10:53 0 88
Telangana
జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం.. హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు...
By Sidhu Maroju 2025-05-30 14:38:05 0 2K
Andhra Pradesh
ఫిబ్రవరి 11 న శాసన సభ సమా వేశాలు
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సమా వే శాలు ఫిబ్రవ రీ 11 నుండి జరుగనున్న యని అధి కా రీ కంగా రాష్ట్ర...
By Mobbu Venkatramana 2026-02-01 11:36:04 0 444
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టండి
ప్రచురణార్థం 19.12.2025 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబి జి...
By Rajini Kumari 2025-12-19 11:51:15 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com