పల్లిపేటలో భారీ అగ్నిప్రమాదం – ఇల్లు పూర్తిగా దగ్ధం

0
228

కాకినాడ : కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సిఫార్సులకే పెద్దపీట తాగిందుకు మంచినీళ్లు లేవు
*క్యూలైన్లో భక్తుల కష్టాలు.*   *త్రాగేందుకు నీళ్లు లేక భక్తుల అవస్థలు*  ...
By Rajini Kumari 2025-12-30 12:30:50 0 132
Andhra Pradesh
శబరిమల అయ్యప్ప స్వామి గారిని దర్శించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట...
By Kothuru Murali 2026-01-08 12:34:45 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com